బీజేపీలో చేరికపై రేపల్లె ఎమ్మెల్యే అనగాని క్లారిటీ

బీజేపీలో చేరికపై రేపల్లె ఎమ్మెల్యే అనగాని క్లారిటీ
x
Highlights

తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజంలేదని రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. అమిత్‌షాను కలవలేదని, అసలు కలవాల్సిన...

తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజంలేదని రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. అమిత్‌షాను కలవలేదని, అసలు కలవాల్సిన అవసరం తనకు లేదన్నారు. వ్యక్తిగత పనుల కోసం చంద్రబాబుకు చెప్పే ఢిల్లీ వెళ్లానని స్పష్టం చేశారు. గరికపాటి తమ కుటుంబ మిత్రుడని ఆయన్నికలిసేందుకు వెళ్లానని తెలిపారు. ఏపీ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లకూడదా అని ప్రశ్నించారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం సరికాదని సూచించారు. తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని, తాను వ్యాపారవేత్తను కాదని సత్యప్రసాద్‌ తెలిపారు. ఏపీ సార్వత్రి ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం పడిపోయిందని, బీజేపీ అన్యాయం చేసిందనే భావన ఏపీ ప్రజల్లో బలంగా ఉందని అందుకే ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేశారని సత్యప్రసాతద్ అన్నారు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చవలసిన బాధ్యత ఉందని, చంద్రబాబు గొప్ప నాయకుడు అని అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories