తిరుచానూరు అమ్మవారికి తిరుమల శ్రీవారి సారె...

Sare for Goddess Padmavathi from Tirumala to Tiruchanur
x

కార్తీక బ్రహోత్సవాలు ముగింపు ఘట్టం సందర్భంగా.. తిరుమల నుండి తిరుచనూరు పద్మావతి అమ్మవారికి సారె

Highlights

Tirumala: స్వామివారి పాదాల వద్ద సారేకు ప్రత్యేక పూజలు

Tirumala: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుమల శ్రీవారు సారెను పంపించారు. తిరుచానూరులో జరుగుతున్న అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ముగింపు ఘట్టం పంచమి తీర్థం సందర్భంగా.. పసుపు-కుంకమ, చందనం, పట్టుచీర పెట్టి గర్భాలయంలో స్వామివారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఊరేగింపుగా కాలినడకన తిరుచానూరుకి తీసుకెళ్లారు. ఈ సారె ఊరేగింపులో టీటీడీ ఈవో, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. కాలిబాట గుండా తిరుపతికి తీసుకొచ్చిన సారెను అలిపిరి పాదాల మండపం వద్ద నుండి ఏనుగుపై ఊరేగింపుగా తిరుచానూరు తీసుకెళ్తారు. అనంతరం పుష్కరిణిలో చక్రస్నానం కార్యక్రమం జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories