ఏపీ ప్రాజెక్టులపై వైసీపీని ప్రశ్నిస్తూ నారా లోకేష్ ట్వీట్

ఏపీ ప్రాజెక్టులపై వైసీపీని ప్రశ్నిస్తూ నారా లోకేష్ ట్వీట్
x
Highlights

వైసీపీపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెటైర్లు వేశారు. పోలవరం నిధులపై వైసీపీ సొంత డబ్బా కొట్టుకుంటోందంటూ ట్వీట్ చేశారు. పోలవరం నిధుల...

వైసీపీపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెటైర్లు వేశారు. పోలవరం నిధులపై వైసీపీ సొంత డబ్బా కొట్టుకుంటోందంటూ ట్వీట్ చేశారు. పోలవరం నిధుల విడుదలకు కేంద్రం ముందుకు రావడం తమ ఘనతే అన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం పంపిన అంచనాలను కేంద్రం ఇప్పుడు ఆమోదించిందని ఈ పరిణామాలతోనే అవినీతి లేదని తేలిపోయిందంటూ ట్వీట్ చేశారు. చంద్రబాబు రేయింబవళ్ల కష్టానికి పోలవరం ప్రాజెక్టు పనులు నిలువెత్తు సాక్షమన్నారు. టీడీపీ హయంలోనే 70 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. వైసీపీ,బీజేపీ నేతలు ఇప్పటికైనా అనవసర విమర్శలు మానుకోని మిగిలిన 30 శాతం పనులు పూర్తి చేయడంపై దృష్టి పెడితే మంచిదంటూ లోకేష్ ట్వీట్ చేశారు. యూరప్ పర్యటనలో ఉన్న నారా లోకేష్ ఈ రాత్రికి స్వదేశానికి రానున్నారు. పోలవరం అంచనా నిధుల విడుదలకు కేంద్రం ఆమోదించిన నేపధ్యంలో లోకేష్ ఈ ట్వీట్ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories