చెప్పింది చేస్తాం .. మంత్రి బొత్సా

చెప్పింది చేస్తాం .. మంత్రి బొత్సా
x
Highlights

మా ప్రభుత్వం ఏం చేయబోతోందో గవర్నర్ చెప్పారు. వచ్చే ఐదేళ్ళలో అన్నిటినీ కచ్చితంగా చేసి చూపిస్తాం అన్నారు రాష్ట్ర మున్సిపల్‌ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి...

మా ప్రభుత్వం ఏం చేయబోతోందో గవర్నర్ చెప్పారు. వచ్చే ఐదేళ్ళలో అన్నిటినీ కచ్చితంగా చేసి చూపిస్తాం అన్నారు రాష్ట్ర మున్సిపల్‌ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ . గవర్నర్ ప్రసంగం అనంతరం అయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఏం చెప్పామో అదే చేస్తామన్నారు. అవినీతి లేని పారదర్శక పాలన అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారన్నారు. నవరత్నాల ద్వారా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారని తెలిపారు. విద్య, వైద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. వైద్యం కోసం ఇకపై ఏ నిరుపేద ఇబ్బంది పడాల్సిన పనిలేదని, వెయ్యి ఖర్చు దాటితే ప్రభుత్వమే దాన్ని భరిస్తుందన్నారు. నిర్బంధ విద్య కోసం అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తామన్నారు. రైతాంగం సంక్షేమం కోసం మరిన్ని మెరుగైన పథకాలు అమలు చేస్తామని తెలిపారు. అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేర్చనున్నట్లు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories