ట్వీటర్‌లో కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు.. ఈసారి టీడీపీ నేత టార్గెట్‌!

ట్వీటర్‌లో కేశినేని నాని  సంచలన వ్యాఖ్యలు.. ఈసారి టీడీపీ నేత టార్గెట్‌!
x
Highlights

విజయవాడ ఎంపీ కేశినేని నాని సొంత పార్టీపై విమర్శల పరంపరను కొనసాగిస్తున్నారు. టీడీపీ నేతలపైనే సోషల్‌మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టారు....

విజయవాడ ఎంపీ కేశినేని నాని సొంత పార్టీపై విమర్శల పరంపరను కొనసాగిస్తున్నారు. టీడీపీ నేతలపైనే సోషల్‌మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఇప్పటికే పలువురు పార్టీ నేతలను టార్గెట్‌ చేసిన ఆయన తాజాగా టీడీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను ఉద్దేశించి పరోక్షంగా ట్వీట్‌ చేశారు.ఏమీ తెలియని వారు, ఏమీ చేయలేని వారు కూడా ట్వీట్లు చేస్తుండటం దౌర్భాగ్యమని బుద్దా వెంకన్నపై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు, నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేనివాడు, నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్ చేయడం దౌర్భాగ్యమన్నారు. కాగా కొద్దిరోజుల నుంచి బుద్ధా వెంకన్న ట్వీటర్‌లో యాక్టివ్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఆయన కొత్తగా ట్వీట్స్‌ పెడుతున్న నేపథ్యంలో కేశినేని నాని టార్గెట్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories