నూజివీడు ట్రిపుల్ ఐటీ ఘటన మరవక ముందే మచిలీపట్నంలో మరో కలకలం

నూజివీడు ట్రిపుల్ ఐటీ ఘటన మరవక ముందే మచిలీపట్నంలో మరో కలకలం
x
Highlights

కృష్ణా జిల్లాలో నూజివీడు ట్రిపుల్ ఐటీ ఘటన మరవక ముందే.. అలాంటిదే మరో ఘటన.. తీవ్ర సంచలనం రేపుతోంది.

కృష్ణా జిల్లాలో నూజివీడు ట్రిపుల్ ఐటీ ఘటన మరవక ముందే.. అలాంటిదే మరో ఘటన.. తీవ్ర సంచలనం రేపుతోంది. మచిలీపట్నం బచ్చుపేటలోని సాంఘీక సంక్షేమ శాఖ వసతి గృహంలోని విద్యార్థినుల రూముల్లోకి కొందరు యువకులు చొరబడ్డారు. దీంతో ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. 10 మంది యువకులు బాలికల వసతి గృహంలో ఏకంగా 4 గంటల పాటు గడిపారు. అయితే యువకులు వచ్చిన సమయంలో.. వార్డెన్ హాస్టల్ లో లేరని తెలుస్తోంది.

ఓ యువకుడి పుట్టిన రోజు కావడంతో.. విద్యార్థినులకు ఆ యువకులు బిర్యానీ వండి పెట్టినట్లు చెబుతున్నారు. రాత్రి 7 గంటలా 30 నిమిషాల వరకు విద్యార్థినులతోనే యువకులు ఉన్నట్లు చెబుతున్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న టీడీపీ, వైసీపీ, మహిళా సంఘాల నాయకులు.. హాస్టల్‌కు దగ్గరకు వచ్చి నిరసన చేపట్టారు. విద్యార్థినుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories