భక్తులకు సెక్యూరిటీ సిబ్బందికి మధ్య ఘర్షణ

భక్తులకు సెక్యూరిటీ సిబ్బందికి మధ్య ఘర్షణ
x
Highlights

అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భక్తులకు, సెక్యూరిటీకి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తమిళనాడు రాష్ట్రం చెంగల్ పట్టుకు చెందిన 45మంది భక్త బృందం తిరుమల...

అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భక్తులకు, సెక్యూరిటీకి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తమిళనాడు రాష్ట్రం చెంగల్ పట్టుకు చెందిన 45మంది భక్త బృందం తిరుమల శ్రీవారిని దర్సించుకోవడానికి తిరుపతికి చేరుకున్నారు. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద లగేజ్ చెక్ చేస్తుండగా నారాయణస్వామి అనే భక్తుడు గుట్కా ప్యాకెట్ ను చేతిలో పట్టుకున్నాడు. సెక్యూరిటీ సిబ్బంది గుట్కా తీసుకెళ్ళకూడదని చెప్పి కిందపడేయమన్నారు. నారాయణస్వామి గుట్కా ప్యాకెట్ ను కిందపడేసి లగేజ్ ను చెక్ చేయించుకుని వెనక్కి వచ్చి మళ్ళీ గుట్కా ప్యాకెట్ ను ఎత్తుకున్నాడు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది నారాయణస్వామి చేతిలో ఉన్న గుట్కా ప్యాకెట్ ను బలవంతంగా తీసుకున్నారు. అయితే నారాయణస్వామి గుట్కా ప్యాకెట్ ఇవ్వకుండా సెక్యూరిటీతో వాగ్వాదానికి దిగారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది, భక్త బృందానికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా సెక్యూరిటీ సిబ్బంది నాపాయణస్వామిపై దాడి చేశారు. అడ్డొచ్చిన భక్తబృందాన్ని కొట్టారు. నారాయణస్వామిని బలవంతంగా లాక్కెళ్ళి సెక్యూరిటీ సిబ్బంది చితకబాదారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories