AP Elections 2020: స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సుప్రీం కోర్టులో విచారణ

AP Elections 2020: స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సుప్రీం కోర్టులో విచారణ
x
YS Jagan (File Photo)
Highlights

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటనపై.. రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటనపై.. రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇవాళ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది. సీజేఐ జస్టిస్ ఎస్ ఏ బాబ్డే ఆధ్వర్యంలో ఈ విచారణ జరిగే అవకాశం ఉంది. కాగా, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 15న నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిన్న సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఉత్తర్వులు నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్ లో కోరింది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories