దుర్గగుడి ఫ్లైఓవర్‌ నిర్మాణం డిసెంబర్‌ కల్లా పూర్తి చేస్తాం: మంత్రి ధర్మాన

దుర్గగుడి ఫ్లైఓవర్‌ నిర్మాణం డిసెంబర్‌ కల్లా పూర్తి చేస్తాం: మంత్రి ధర్మాన
x
Highlights

దుర్గగుడి ఫ్లైఓవర్‌ నిర్మాణం డిసెంబర్‌ కల్లా పూర్తి చేస్తామని మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. సచివాలయం ఐదో బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో అడుగుపెట్టిన...

దుర్గగుడి ఫ్లైఓవర్‌ నిర్మాణం డిసెంబర్‌ కల్లా పూర్తి చేస్తామని మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. సచివాలయం ఐదో బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో అడుగుపెట్టిన కృష్ణదాస్‌ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్డీబీ ప్రాజెక్టుకు సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేసిన అనంతరం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ పాలన చేస్తున్నామన్నారు. అనంత-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించి సమర్థంగా పని చేస్తామన్నారు. అలాగే దివంగత నేత వైఎస్సార్‌ పాలనను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తు చేస్తున్నారని మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. మంత్రి వర్గంలో అన్ని వర్గాలవారికి సముచిత స్థానం కల్పించారన్నారు. ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడం ఓ చరిత్ర అని తెలిపారు. రోడ్లు, భవనాల శాఖ అత్యంత కీలకమైనవని, అందరినీ కలుపుకుని పనిచేస్తానని అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories