చంద్రబాబు మా మాట వినలేదు!

చంద్రబాబు మా మాట వినలేదు!
x
Highlights

తాము చెప్పిన మాటలు చంద్రబాబు వినలేదంటూ తాజాగా బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి చెప్పుకొచ్చారు. అప్పుడు ధర్మపోరాట దీక్ష వద్దని తాను...

తాము చెప్పిన మాటలు చంద్రబాబు వినలేదంటూ తాజాగా బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి చెప్పుకొచ్చారు. అప్పుడు ధర్మపోరాట దీక్ష వద్దని తాను చంద్రబాబుకు సూచించానని అయన చెప్పారు. విజయవాడ వచ్చిన అయన బీజేపీ నిర్వహించిన ఆత్మీయ సమావేశం లో మాట్లాడారు. ఆ దీక్షలు అధర్మ పోరాటమని తానూ ఎంతగానో చెప్పాననీ, కానీ ఆయనతో ఉండే కొందరు నేతల మాటలు విని అధర‍్మ పోరాట దీక్షలు చేశారన్నారు. పార్టీ అధ్యక్షుడి నిర్ణయానికి కట్టుబడి ఆనాడు బహిరంగంగా మాట్లాడలేకపోయానన్నారు. ఇప్పటి వరకూ పరోక్ష రాజకీయాల్లో ఉన్నాననీ, ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో రాబోతున్నననీ ప్రకటించారు. ''పంచ దేశాల ముందు దేహీ అనే ప్రధానులే ఉన్నారు కానీ భారతదేశం గొప్పతనాన్ని చాటింది ప్రధాని నరేంద్ర మోదీ. బీజేపీ నిర్ణయాలు ఏపీ అభివృద్ధి వైపే ఉన్నాయి. రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయం అవ్వాలనే నేను భారతీయ జనతా పార్టీలో చేరాను'' అంటూ అయన తను బీజేపీలో చేరిన కారణాలను వివరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories