మమ్మల్ని అన్నది ఇక చాలన్నా.. వైసీపీ సంగతి చూడండి!

మమ్మల్ని అన్నది ఇక చాలన్నా.. వైసీపీ సంగతి చూడండి!
x
Highlights

ఏపీ అసెంబ్లీ లాబీల్లో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది 'అన్నా.. ఇక టీడీపీని...

ఏపీ అసెంబ్లీ లాబీల్లో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది 'అన్నా.. ఇక టీడీపీని విమర్శించింది చాలు.. ఇక అధికార పక్షాన్ని కడిగేయండి' అని బుద్దా వెంకన్న.. సోము వీర్రాజుతో అన్నారు. ఇందుకు స్పందించిన సోము.. 'దానికి ఇంకా సమయం ఉంది.. వైసీపీని కూడా వదిలి పెట్టం' అని రిప్లై ఇచ్చారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణను విన్న తోటి శాసన మండలి సభ్యులు ఒకింత నవ్వుకున్నారు. కాగా.. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సోమువీర్రాజు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడమే కాదు.. టీడీపీ అధినేత చంద్రబాబుపై సైతం పలుమార్లు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories