బడా నేతలకు బీజేపీ గాలం..తెలంగాణలో మాజీ ఎంపీ.. ఏపీలో మాజీ సీఎం!

బడా నేతలకు బీజేపీ గాలం..తెలంగాణలో మాజీ ఎంపీ.. ఏపీలో మాజీ సీఎం!
x
Highlights

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ జోరుమీదుంది. ఎలాగైనా బలపడాలని చూస్తోన్న కమలం పార్టీ.. తమ గూటికి పలు పార్టీల నేతలను చేర్చుకునే పనిలో పడింది. అందులో భాగంగా...

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ జోరుమీదుంది. ఎలాగైనా బలపడాలని చూస్తోన్న కమలం పార్టీ.. తమ గూటికి పలు పార్టీల నేతలను చేర్చుకునే పనిలో పడింది. అందులో భాగంగా తెలంగాణ నుంచి మాజీ ఎంపీ వివేక్, ఏపీ నుంచి మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిలను పార్టీలోకి ఆహ్వానించినట్టు ప్రచారం జరుగుతోంది.

ఆపరేషన్ కమలంలో భాగంగా తెలుగు రాష్ట్రాలకు నేతలకు బీజేపీ గాలం వేస్తోంది. తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలవడంతో ఫుల్ జోష్‌లో ఉన్న బీజేపీ.. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో ఎలాగైనా బలపడాలని.. అధికారంలోకి రావాలని చూస్తోంది. ఈ క్రమంలో మాజీ ఎంపీ ఎంపీ గడ్డం వివేక్‌ను పార్టీలోకి ఆహ్వానించింది. గత లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన ఆయన కూడా బీజేపీలో చేరడానికి సుముఖంగా ఉన్నారు. బీజేపీ చీఫ్ అమిత్ షా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. వివేక్‌తోపాటు ఆయన సోదరుడు, మాజీ మంత్రి వినోద్ కూడా బీజేపీలో చేరతారని తెలుస్తోంది.

2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసిన వివేక్ అనూహ్యంగా బాల్క సుమన్ చేతిలో ఓడారు. అనంతరం కారెక్కిన ఆయనకు ప్రభుత్వ సలహాదారు పదవి దక్కింది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సుమన్‌ చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి పెద్దపల్లి టికెట్‌ తనదేనని వివేక్ భావించారు. కానీ కేసీఆర్ మాత్రం వెంకటేశ్ నేతకు టికెట్ ఇచ్చారు. దీంతో కొన్నాళ్లుగా సైలెంట్‌గా ఉన్న వివేక్, వినోద్ సోదరులు టీఆర్ఎస్‌కు బీజేపీయే సరైన ప్రత్యామ్నయం అని భావించారని తెలుస్తోంది. మరోవైపు ఏపీలో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా అదేబాటలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి తెలుగు రాష్ట్రాల్లో పాగా వేసేందుకు బీజేపీ ఎవరెవరినీ కమలం గూటికి చేరుస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories