భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం:వైవీ సుబ్బారెడ్డి

భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం:వైవీ సుబ్బారెడ్డి
x
Highlights

తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత...

తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సుబ్బారెడ్డి మొదటి సారిగా తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో భక్తులకు అందుతున్న సదుపాయాలపై ఆరాతీశారు. ఆ తర్వాత భక్తులతో కలిసి క్యూలైన్ లో స్వామివారిని దర్శించుకున్నారు. లడ్డూ విక్రయ కేంద్రం, బూందీపోటులో తనిఖీలు నిర్వహించారు. సిబ్బంది పనితీరు, లడ్డూ తయారీలో నాణ్యత ప్రమాణాలను అడిగి తెలుసుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు తిరుమలలో ఎలక్ర్టిక్ బస్సులను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories