జనసేన పార్టీకి మరో షాక్‌!

జనసేన పార్టీకి మరో షాక్‌!
x
Highlights

ఏపీ సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తెలుగుదేశం, జనసేనకు చెందిన పలువురు నేతలు మాత్రం బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధం అవుతున్నారు. ఇటివల ముగిసిన ఏపీ...

ఏపీ సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తెలుగుదేశం, జనసేనకు చెందిన పలువురు నేతలు మాత్రం బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధం అవుతున్నారు. ఇటివల ముగిసిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ మాత్రం కేవలం ఒక్కసీటుతోనే సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి మరో షాక్‌ తగలనుంది. ఎన్నికల్లో ఓటమిపై పార్టీ నేతలు ఎవరు కూడా అధైర్యపడవద్దంటూ ఆ పార్టీ అధినేత పవన్‌ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినా కానీ నేతల్లో మాత్రం ధైర్యాన్ని నింపడం లేదు. తాజాగా జనసేన పార్టీ సీనియర్‌ నేత ఆకుల సత్యనారాయణ జనసేనకు గుడ్‌బై చెప్పనున్నారు. తిరిగి సత్యనారాయణ సొంతగూటికి (బీజేపీ) గూటికి చేరుకోనున్నారు. కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి నుంచి జనసేన తరఫున ఎంపీగా బరిలోకి దిగి ఘోర ఓటమిపాలయ్యారు. అంతకు ముందు రావెల కిషోర్‌ బాబు కూడా జనసేనకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక టీడీపీ నుంచి కూడా పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories