యాదాద్రి భువనగిరి జిల్లాలో వీఆర్వో లంచం తీసుకొని పాస్బుక్ ఇవ్వడం లేదని ఓ మహిళ నిలదీసింది. తహశీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా గుండాల ఎమ్మార్వో కార్యాలయం ముందు రెవెన్యూ సిబ్బంది నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నారు. ఇదే క్రమంలో అక్కడికి వచ్చిన ఓ మహిళ తన దగ్గర లంచం తీసుకొని పాస్బుక్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని వాపోయింది. తన వద్ద రూ.2 వేలు లంచం తీసుకున్నాడంటూ మహిళ రెవెన్యూ ఉద్యోగిని నిలదీసింది. తన దగ్గర వసూలు చేసిన డబ్బులు ఇవ్వకుంటే గల్లా పట్టి వసూలు చేస్తానని హెచ్చరించింది.