ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో ప్రభుత్వం వేసిన అఫిడవిట్పై మండిపడ్డారు పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి. ప్రతిపక్షాలు ఆర్టీసీ యూనియన్లు కలిసి ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షాలు కుట్రలు చేసినట్టయితే కేసులు పెట్టాలన్నారు. లేకుంటే తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన ఎండీ సునీల్ శర్మను సర్వీస్ నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.