హుజుర్నగర్ ఉప ఎన్నిక ఫలితం టీఆర్ఎస్ ఖాతాలో పడనుంది. హుజూర్నగర్లో ఉప ఎన్నిక ఫలితం దాదాపు తేలిపోయింది. టీఆర్ఎస్ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకూ 10 రౌండ్లు పూర్తవ్వగా ప్రతీ రౌండ్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థే ముందంజలో ఉన్నారు. శానంపూడి సైదిరెడ్డికి తొలి రౌండ్లో టీఆర్ఎస్ 2,467 ఓట్ల ఆధిక్యం సాధించగా, రెండో రౌండ్లోనూ 4 వేల మెజార్టీతో, మూడో రౌండ్లో 6,777, నాలుగో రౌండ్లో 9,356, ఐదో రౌండ్లో 11 వేలు, ఆరో రౌండ్లో 12,356, ఏడో రౌండ్లో 14,300, ఎనిమిదో రౌండ్లో 17,400, తొమ్మిదో రౌండ్లో 19,200 ఓట్ల మెజార్టీ వచ్చింది.