ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చిస్తున్నారు. అలాగే, విభజనసమస్యలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, కేంద్రం నిధులు రాబట్టే అంశాలపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నెల 17 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో లోక్సభాపక్ష నేత, ఉప నేతను ఈ సమావేశంలో ఎంపిక చేయనున్నారు.