సూర్యాపేట జిల్లా కోదాడలో అంబులెన్సులో రాకపోకలు కొనసాగిస్తున్నారు. పేషంట్ల ముసుగులో దొంగచాటుగా ప్రయాణికులను చేరవేస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెయ్యి రూపాయల చొప్పున ఛార్జీలు వసూలు చేస్తున్నారు. పోలీసులు అంబులెన్స్ వాహనం కనిపించడంతో రోడ్డు క్లియర్ చేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా రవాణా సాగిస్తున్నారు అంబులెన్స్ డ్రైవర్లు.