విద్యుత్ సంస్థలపై అవగాహన లేకుండా లక్ష్మణ్ మాట్లాడారు : సీఎండీ ప్రభాకర్ రావు
బీజేపీ నేత లక్ష్మణ్ మాటలు తనను బాధించాయన్నారు ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు. తాను ఏ పార్టీ కండువా కప్పుకోలేదని, ఏ ప్రభుత్వం ఉన్నా ప్రొఫెషన్గా సంస్థను నడిపిస్తున్నానని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా అన్నీ డిస్కకంలు నష్టాల్లోనే ఉన్నాయని తెలిపారు. విద్యుత్ సంస్థలపై అనుమానాలు, అపోహలు సృష్టించవద్దని హితవు పలికారు. ఇకనైనా విద్యుత్ సంస్థలపై పూర్తి అవగాహనతో మాట్లాడాలని లక్ష్మణ్కు సూచించారు సీఎండీ ప్రభాకర్ రావు.