తెలంగాణలో డిగ్రీ, ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియ వాయిదా పడింది. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేటి నుంచి ప్రారంభంకావాల్సిన డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు వాయిదా వేస్తున్నట్లు దోస్త్ కన్వీనర్ లింబాద్రి ప్రకటించారు. దోస్త్ ప్రక్రియ తేదీలు తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో జరగాల్సిన అన్ని ప్రవేశ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వాయిదా వేసింది.