మంత్రులకు శాఖల కేటాయింపు

Update: 2019-02-19 14:21 GMT

మంగళవారం ఏర్పడ్డ కొత్త మంత్రివర్గంలో పదిమంది మంత్రులకు శాఖల కేటాయింపు చేశారు సీఎం కేసీఆర్. ఇందులో భాగంగా.. వేముల ప్రశాంత్ రెడ్డికి - రోడ్లు భవనాలు, రవాణా శాఖ. నిరంజన్ రెడ్డికి - వ్యవసాయ శాఖ. ఇంద్రకరణ్ రెడ్డికి - న్యాయ, అటవీ, దేవాదాయ శాఖ. జగదీశ్ రెడ్డికి - విద్యా శాఖ. కొప్పుల ఈశ్వర్ కు - సంక్షేమం. మల్లారెడ్డికి - కార్మిక శాఖ, ఈటెల రాజేందర్ కు - వైద్య ఆరోగ్య శాఖ. శ్రీనివాస్ గౌడ్ కు - 'టూరిజం , క్రీడలు , యువజన సర్వీసులు'. ఎర్రబెల్లి దయాకర్ రావుకు - పంచాయితి రాజ్ శాఖ కేటాయించారు. కాగా హోమ్ శాఖను ఉపముఖ్యమంత్రి మొహమ్మద్ అలికి కేటాయించిన కేసీఆర్.. ఇక ఆర్ధిక శాఖ మంత్రులకు కేటాయించని ఇతర శాఖలను తన వద్దే ఉంచుకున్నారు.

Similar News