8న తెలంగాణ గవర్నర్గా తమిళసై ప్రమాణస్వీకారం
తెలంగాణకు తొలి మహిళా గవర్నర్గా తమిళిసై సౌందర రాజన్ నియమితులైన విషయం తెలిసిందే. కాగా రాష్ట్ర గవర్నర్గా ఈ నెల 8వ తేదీన(ఆదివారం) ఉదయం 11 గంటలకు తమిళసై సౌందర్ రాజన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
తెలంగాణకు తొలి మహిళా గవర్నర్గా తమిళిసై సౌందర రాజన్ నియమితులైన విషయం తెలిసిందే. కాగా రాష్ట్ర గవర్నర్గా ఈ నెల 8వ తేదీన(ఆదివారం) ఉదయం 11 గంటలకు తమిళసై సౌందర్ రాజన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. తమిళసై సౌందర్ రాజన్చే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎస్ చౌహాన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు, అధికారులు హాజరు కానున్నారు. మొత్తానికి తెలంగాణ తొలి మహిళా గవర్నర్గా ఆమె రికార్డు సృష్టించనున్నారు.