రెచ్చిపోయిన ఎస్సై.. రైతు చెంపపై పదే పదే కొట్టిన ఎస్సై

Update: 2020-02-15 11:56 GMT
రెచ్చిపోయిన ఎస్సై.. రైతు చెంపపై పదే పదే కొట్టిన ఎస్సై

సహకార సంఘం ఎన్నికలలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. పబ్లిక్‌లో ఓ రైతుపై చేయి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. నల్గొండ జిల్లాలో హాలియా మండలం కొత్తపల్లిలో రైతుపై ఎస్సై చేయి చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది.

కొత్తపల్లి సహకార సంఘం ఎన్నికల్లో ఓటువేసేందుకు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో కొంత మంది ఓట్లర్లు ఒక్కసారిగా లోపలికి దూసుకువచ్చేందుకు యత్నించారు. దీంతో వారిని అదుపు చేసేందుకు ఎస్సై వీరరాఘవులు యత్నిస్తుండగా ఎస్సై రైతులకు మధ్య వాగ్వవాదం జరిగింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్సై వీరరాఘవులు ఓ రైతుపై చేయి చేసుకున్నాడు. రైతు చెంపపై పదే పదే కొట్టాడు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. ఎస్సై వీరరాఘవులుపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News