ఉస్మానియా హాస్పిటల్లో ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్షం నేతలు భేటీ అయ్యారు. హైకోర్టు లేబర్ కమిషన్కు ఇచ్చిన ఆదేశాలపై చర్చించారు. భవిష్యత్ కార్యాచరణ, రేపటి సడక్ బంద్పై మంతనాలు జరిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరామ్, చాడ, మందకృష్ణ, నాగం జనార్థన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వద్ధారెడ్డి, రాజిరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.