యురేనియం తవ్వకాల వల్ల జీవరాశి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు పలువురు మేధావులు. దండకారణ్యంలో తవ్వకాలు జరిపితే చెంచులు, ఆదివాసీయులు అంతరించే ప్రమాదం ఉందన్నారు. నాంపల్లి ఎన్టీఆర్ ఆడిటోరియంలో నల్లమల్ల ఈజీ అవర్స్పై జరిగిన కార్యక్రమాల్లో రిటైర్డ్ హైకోర్ట్ చీఫ్ జస్టీస్ చంద్రకుమార్, నటుడుఆర్ నారాయణమూర్తితో పాటు పలువురు మేధావులు పాల్గొన్నారు. అంబాని, ఆదాని వాళ్లే కాదు దేశంలో ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలని...తాగే పాల దగ్గర నుంచి ప్రతీ ఒక్కటి కల్తీ అవుతుందని ఆవేదనవ్యక్తం చేశారు. నల్లమల్ల యురేనియం తవ్వకాలు వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.