ప్రయాణీకుల నుంచి తాత్కాలిక కండక్టర్ల నిలువుదోపిడి..!

Update: 2019-10-05 09:42 GMT

ఆర్టీసీ బస్సులు నడిపేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు తాత్కాలిక సిబ్బంది గండికొడుతున్నారు. సమ్మె సమయంలోనే దోచుకోవాలనే ఉద్దేశంతో తమకు ఇష్టం వచ్చినంత డబ్బు వసూలు చేస్తున్నారు. తమ నుంచి నిర్దేశించిన చార్జీలకు మించి డబ్బు వసూలు చేస్తున్నారంటూ జనగామలో ప్రయాణీకులు ఆందోళనకు దిగారు. జనగామ నుంచి సూర్యాపేటకు టికెట్ ధర 60 రూపాయలు ఉండగా వంద రూపాయలు తీసుకున్నారంటూ ఆర్టీసీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. టికెట్ ఇవ్వకుండా దోచుకుంటున్నారంటూ అధికారులపై మండిపడ్డారు.

Full View 

Tags:    

Similar News