దేశంలో సమగ్ర విద్యుత్ విధానం రావాల్సిన అవసరం ఉంది: సీఎం కేసీఆర్

Update: 2019-08-18 11:51 GMT

దేశంలో సమగ్ర విద్యుత్ విధానం రావాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పవర్‌ కార్పోరేషన్‌ సీఎండి రాజీవ్‌శర్మతో ముఖ్యమంత్రి దేశ రాష్ట్ర విద్యుత్ పరిస్థితులపై సుదీర్ష సమీక్ష చేపట్టారు. ఇటీవలే కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన పవర్ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ సీఎండి రాజీవ్ శర్మ ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు.

Tags:    

Similar News