టిక్‌టాక్‌ చేసిన ఉద్యోగులపై వేటు

Update: 2019-07-16 11:47 GMT

ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో విధులు నిర్వహించకుండా, టిక్‌టాక్‌ చేస్తూ మీడియాకు దొరికిన ఉద్యోగులపై వేటు పడింది. ఖమ్మం కార్పోరేషన్‌ ఆఫీసులో పని చేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఆఫీసులో పనులు చేయకుండా టిక్‌టాక్‌ చేయడం వివాదంగా మారింది. ఆఫీసులో విధులు నిర్వహించాల్సిన సమయంలో వివిధ పనులపై వచ్చేవారిని పట్టించుకోకుండా, కాలపక్షేపం చేస్తూ టిక్‌టాక్ వీడియోలు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఖమ్మం మున్సిపల్ కమిషనర్‌ టిక్‌టాక్‌ చేసిన సిబ్బందిపై వేటు వేశారు. 9 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 

Tags:    

Similar News