ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు బీజేపీలో చేరనున్నారు. రేపు నోవాటెల్ హోటల్లో బీజేపీ చీఫ్ అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకునేందురు రంగం సిద్ధం మయింది. రేపు హైదరాబాద్కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వస్తున్నారు. అధికార పగ్గాలు చేపట్టాక రెండోసారి అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. శనివారం శంషాబాద్లో జరిగే పార్టీ రాష్ట్రస్థాయి నేతల సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ రానున్న అమిత్ షా. ఈ సందర్భంగా పలువురు ముఖ్య నేతలతో భేటీ అవుతారు. అయితే.. అమిత్ షా హైదరాబాద్కు రావడంతో పలువురు పార్టీ నేతలు బీజేపీలో చేరబోతున్నారని ఊహాగానాలు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి.