ఎంజీఎం మార్చురీ వైద్యులపై మంత్రి ఎర్రబెల్లి మండిపడ్డారు. మార్చురీ అంతా దుర్గంధంతో భరించలేని విధంగా ఉందని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 గంటలయినా వైద్యులు రాకపోవడంతో ఎంజీఎం మార్చురీ నిర్వాహకురాలు కేఎంసీ ప్రిన్సిపాల్ సంధ్యారాణికి ఫోన్ చేశారు. మార్చురీ వైద్యులపై చర్యలు తీసుకోవాలని, ఇక నుండి పరిశుభ్రంగా ఉంచాలని ప్రిన్సిపాల్ సంధ్యారాణికి వార్నింగ్ ఇచ్చారు మంత్రి.