మారుతీరావును ఉరితీయాలని అమృత డిమాండ్ చేసిందని మారుతీరావు సోదరుడు శ్రవణ్ ఆరోపించారు. అమృత అనవసర ఆరోపణలు చేస్తుందన్నారు. ప్రణయ్ హత్యకు ముందు నుంచే మారుతిరావుతో అమృతకు మాటల్లేవని తెలిపారు. అమృత విషంలోనే గొడవలు తప్ప తన అన్నకు, తనకు ఆర్థిక లావాదేవీల్లో ఎలాంటి సమస్యలు లేవని శ్రవణ్ చెప్పారు. మారుతీరావుకు చెందిన ఒక్కపైసా కూడా తనకు అవసరం లేదన్నారు. తన సోదరుడు పోయాక ఆయన వెనకాల ఉన్న ఆస్తిపై ప్రేమ పుట్టుకొచ్చిందని.. డబ్బు కోసమే అమృత డ్రామాలు ఆడుతుందని ఆయన ఆరోపించారు. నిన్నటివరకు తండ్రి చావాలని కోరుకున్న అమృతకు ఇప్పుడు ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందని ఆయన ప్రశ్నించారు.
అమృత చేసిన చెత్త పనికే ఇవన్నీ జరిగాయని ఆయన మండిపడ్డారు. నాన్న అని పిలవడానికి కూడా ఆమెకు మాటలు రాలేదని తల్లి మీద ప్రేమ ఉంటే నిన్నటి నుంచి ఎందుకు రాలేదని శ్రావణ్ అన్నారు. వాళ్ల అమ్మ దగ్గరకు వస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఈ సందర్భంగా చెప్పారు. ప్రణయ్ హత్య కేసులో అన్యాయంగా తనను జైలుకు పంపారని.. మళ్లీ ఇప్పుడు తనను చంపడానికి ఏవో ఆరోపణలు చేస్తుందని ఆయన అన్నారు.