భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడు, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసరావును మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. టీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ శ్రీనివాసరావు చర్ల మండలం సి.కొత్తూరులో గిరిజనుల పట్టా భూములను కౌలు తీసుకున్నారు. అయితే, కౌలు వ్యవహారంలో మాజీ ఎంపీటీసీ శ్రీనివాసరావును మావోయిస్టులు అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా ఆయన ఇంటికి వచ్చిన మావోయిస్టులు ఆయన్ను తమవెంట తీసుకెళ్లారు. అయితే మావోయిస్టులు హాని తలపెడతారేమోనని శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.