పోలీస్ వాహనం ఢీ కొని వ్యక్తి మృతి

పోలీసు వాహనం ఢీ కొని చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన ఉప్పల్‌లో చోటు చేసుకుంది.

Update: 2019-10-18 05:42 GMT

 పోలీసు వాహనం ఢీ కొని చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన ఉప్పల్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెలితే చందర్‌రావు (82) కర్మన్‌ఘాట్‌లోని శుభోధయ్‌ కాలనీలో నివాసముంటూ ఘట్‌కేసర్‌లోని ఓ నర్సరీలో పని చేస్తున్నాడు. గురువారం ఉదయం ఉప్పల్‌లోని స్టేడియం-మెట్రో స్టేషన్‌ ప్తాంతంలో రోడ్డు దాటే సమయంలో కుషాయిగూడ డిటెక్టివ్‌ ఇన్‌స్సెక్టర్‌(డీఐ) వాహనం అతన్ని ఢీ కొంది.

దీంతో రామచందర్‌రావుకి తీవ్రంగా గాయాలు కావడంతో స్థానికులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన రామచందర్‌రావు శుక్రవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు డ్రైవర్‌పై కేసు నమోదు చేయడంతోపాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని హెడ్‌క్వార్టర్‌కు తరలించామని ఉప్పల్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు.



Tags:    

Similar News