డేవిడ్ రాజు హత్య కేసు..కేఏ పాల్‌పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌!

Update: 2019-08-19 09:41 GMT

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. మహబూబ్ నగర్ కోర్టులో హాజరుకానందున వారెంట్ జారీ అయింది. తన సోదరుడు డేవిడ్ రాజు హత్య కేసులో మహబూబ్ నగర్ జిల్లా కోర్టు ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తన సోదరుడు డేవిడ్‌ రాజు హత్య కేసులో కేఏ పాల్‌ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసు విచారణకు మిగతా నిందితులు న్యాయస్థానానికి హాజరైనప్పటికీ కేఏ పాల్‌ హాజరుకాలేదు. దీంతో మహబూబ్‌నగర్‌ న్యాయస్థానం నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News