తెలంగాణ లోకాయుక్త, ఉపలోకాయుక్త నియామకం

Update: 2019-12-20 06:57 GMT

తెలంగాణ లోకాయుక్తను, ఉపలోకాయుక్తను ప్రభుత్వం నియమించింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని కమిటీ ప్రగతిభవన్ లో సమావేశమై లోకాయుక్త, ఉపలోకాయుక్త పేర్లను నిర్ణయించింది. లోకాయుక్తగా జస్టిస్ సివి.రాములు, ఉప లోకాయుక్తగా జి.నిరంజన్ రావు పేర్లను కమిటీ సిఫారసు చేయగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు.

తెలంగాణ లోకాయుక్తను, ఉపలోకాయుక్తను ప్రభుత్వం నియమించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని కమిటీ ప్రగతిభవన్ లో సమావేశమై లోకాయుక్త, ఉపలోకాయుక్త పేర్లను నిర్ణయించింది. లోకాయుక్తగా జస్టిస్ సివి.రాములు, ఉప లోకాయుక్తగా జి.నిరంజన్ రావు పేర్లను కమిటీ సిఫారసు చేయగా కమిటీ చేసిన సిఫారసులను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు.

కమిటీలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీ, మండలిలో విపక్ష నాయకులు పాషా ఖాద్రీ, జాఫ్రీ ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ప్రభుత్వం నియమించింది. దీనికి ఛైర్మన్ గా బి. చంద్రయ్య, సభ్యులుగా ఎన్. ఆనందరావు, మొహమద్ ఇర్ఫాన్ మోయినుద్దీన్ లను నియమించింది తెలంగాణ సర్కార్.


Tags:    

Similar News