ఖమ్మం జిల్లాలో మూడు రోజుల క్రితం కిడ్నాప్కు గురైన లేబర్ ఆఫీసర్ ఆనంద్ రెడ్డి హత్యకు గురయ్యారు. గొల్లబుద్ధారంలో ఆనంద్ రెడ్డిని ప్రదీప్ రెడ్డి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆయన మృతదేహాన్ని పోలీసులు భూపాలపల్లి అడవుల్లో స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణంగా అనుమానిస్తున్నారు.
కాగా వరంగల్ జిల్లాకు చెందిన ఆనంద్ రెడ్డి ప్రస్తుతం ఖమ్మం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్గా పనిచేస్తుండగా ఈ నెల ఏడో తేదీన స్నేహితుడు ప్రదీప్ రెడ్డితో కలిసి బయటకు వెళ్లారు. ఆ తరువాత ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని ప్రత్యేక బృందాలతో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో తాజాగా గొల్లబడ్డారం అడవుల్లో ఆనంద్ రెడ్డి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.