చిన్నతనం నుంచి పోలియోతో బాధపడుతున్న సాయిరాం ప్రస్తుతం మంచిగా నడుస్తున్నాడు. ముఖ్యమంత్రి సహాయనిధి సాయంతో ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆపరేషన్ జరిగి మంచిగా నడుచుకుంటూ కేటీఆర్ను కలిశాడు. తనకు సాయం చేసిన కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ ఏడాది జనవరిలో కేటీఆర్ను కలిసిన సాయిరాం సాయం కోరాడు. పరిస్థితిని గమనించిన కేటీఆర్ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్కు సాయిరాం వైద్యం బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్యే దగ్గరుండి సాయిరాం ఆపరేషన్ బాధ్యతలు చూసుకున్నారు.
సాయి రామ్ అనే అబ్బాయి పుట్టుకతో రెండు కాళ్లు పోలియో వచ్చి ఇబ్బంది పడుతున్నాడు. ఈ జనవరిలో తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి తనకు సహాయం చేయాల్సిందిగా కోరారు. అప్పుడు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు ఈ వ్యవహరం చూసుకోమని కేటీఆర్ సుచించారు. సాయిరాంకు విజయవంతంగా శస్త్రచికిత్సలు పూర్తయ్యాయి. సాయి రామ్ చక్కగ నడుచుకుంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు కలిశారు. సీఎం రిలీఫ్ ఫండ్ సహాయంతో ఆ అబ్బాయికి ఆపరేషన్ జరిగి మంచిగా కోలుకున్నారని కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కి కృతజ్ఞతలు తెలిపారు.
This young boy Sairam 👇 met me in January this year? Ramagundam MLA Chandar Garu had brought him to me
— KTR (@KTRTRS) August 14, 2019
Today, he returned back with his surgeries done and being able to walk normally thanks to CMRF
These are the memories that'll stay with you, when you call it a day😊 pic.twitter.com/SkGJYnx5Ko