లోకో పైలట్ చంద్రశేఖర్ కుడికాలును వైద్యులు తొలగించారు. కాచిగూడ వద్ద రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో లోకో పైలట్ చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. తన కొడుకు కుడికాలుకు సర్జరీ చేసి మోకాలు పైభాగం వరకు తొలగించినట్లు ఆయన తండ్రి చెప్పారు. వైద్యులు అందిస్తున్న చికిత్స పట్ల తామంతా సంతృప్తి వ్యక్తం చేస్తున్నామన్నారు. చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి నెమ్మదిగా కుదుటపడుతుందని.. అందరినీ గుర్తు పడుతున్నాడని తెలిపాడు.