కాంగ్రెస్కు చెందిన పినపాక ఎమ్మెల్యే రేగకాంతారావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు టీఆర్ఎస్ పార్టీలో చేరిపోగా.. రేపో మాపో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుముర్తి లింగయ్య కారెక్కనున్నారు. వీరితోపాటు ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ కూడా టిఆరెస్ లో చేరనున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన హరిప్రియ త్వరలో సీఎం కేసీఆర్ సమక్షంలో టిఆరెస్ లో చేరనున్నారు. ఆమె చేరిక రేవంత్ రెడ్డికి పెద్ద షాకే అని చెప్పాలి. రేవంత్ ఆశీస్సులతో ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు.