హైదరాబాద్లో భజరంగ్దళ్ బీభత్సం.. వాలంటైన్స్ డేను వ్యతిరేకిస్తూ రచ్చ రచ్చ చేసిన కార్యకర్తలు !
హైదరాబాద్లో భజరంగ్ దళ్ కార్యకర్తలు రచ్చ రచ్చ చేశారు. మాదాపూర్లో కార్యకర్తలు హల్చల్ చేశారు. కేక్ షాపులో నానా హంగామా చేశారు. వాలంటైన్స్ డే కోసం ప్రత్యేకంగా స్వీట్లు, కేక్లు తయారు చేస్తున్న విషయం తెలుసుకుని కార్యకర్తలు షాపుపై దాడి చేశారు. ప్రేమికులపై ప్రతాపం చూపారు. కుర్చీలు, బల్లలు విరగ్గొట్టారు. ఇష్టమొచ్చినట్లు తిడుతూ అక్కడ ఉన్నవారిని తరిమేశారు. ఈ నేపథ్యంలో 8 మంది భజరంగ్దళ్ కార్యకర్తలపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
తమ మాల్స్పై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారని కొందరు యజమానులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పలువురు భజరంగ్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అయితే, పోలీసుల అదుపులో ఉన్న కార్యకర్తల్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భజరంగ్దళ్ నేతలు మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఎదుట శనివారం ధర్నాకు దిగారు.