టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ గుడ్‌న్యూస్‌

Update: 2019-12-25 13:09 GMT
టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ గుడ్‌న్యూస్‌

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ గుడ్‌న్యూస్‌ తెలిపారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై సీఎం కేసీఆర్‌ సంతకం చేశారు.

ఈ ఉత్తర్వులు ఆర్టీసీలో పనిచేసే ప్రతి ఉద్యోగికి వర్తించనున్నాయి. 52 రోజుల సమ్మె అనంతరం ఆర్టీసీ కార్మికులతో చర్చల సందర్భంగా ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60కి పెంచుతూ రూపొందించిన ఉత్తర్వులపై సీఎం కేసీఆర్ నేడు సంతకం చేశారు.

Tags:    

Similar News