రాచకొండ కమిషనరేట్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాధిక చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీ పై వెళ్తున్న మహిళను జీహెచ్ఎంసీ చెత్త లారీ ఢీ కొట్టింది. దీంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. చనిపోయిన మహిళ కాప్రా జీహెచ్ఎంసీ కార్యాయలంలో పనిచేస్తున్న సౌందర్యగా గుర్తించారు.
సౌందర్య జీహెచ్ఎంసీలో ఏరియా సూపర్ వైజర్గా పనిచేస్తుంది. ఆమె మంగళవారం ఉదయం విధులలో భాగంగా ఆఫీసుకు వెళ్తుంది. రాధిక సర్కిల్ వద్దకు రాగానే.. జీహెచ్ఎంసీకి చెందిన చెత్త లారీ ఆమెను బలంగా ఢీకొట్టి, ఆమె పైనుంచి దూసుకెళ్లింది. దాంతో సౌందర్య అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.