మాజీ ఎంపీ కవిత కాన్వాయ్‌లో ప్రమాదం!

Update: 2020-03-18 07:53 GMT

నిజామాబాద్‌ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కాన్వాయ్‌లోని ఓ కారు ప్రమాదానికి గురైంది. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు ఎమ్మెల్సీ టికెట్ లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె నామినేషన్ వేసేందుకు నిజామాబాద్ వెళుతుండగా.. ఆమె కాన్వాయిలోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కారుకి ప్రమాదం జరిగింది. కాన్వాయ్‌ తుప్రాన్‌ వద్దకు చేరుకోగానే ముందు వెళ్తున్న ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి కారును కాన్వాయ్‌లోని మరో కారు ఢీకొట్టింది. దీంతో ఎమ్మెల్యే కారు నుజ్జునుజ్జయింది. అయితే, ప్రమాద సమయంలో ఎమ్మెల్యే ఆ అందులో లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాను క్షేమంగానే ఉన్నానని, కార్యకర్తలు ఆందోళన చెందొద్దని ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి తెలిపారు. 

Tags:    

Similar News