యూరియా సమస్య రైతన్నను వేధిస్తోంది. గంటల తరబడి క్యూలైన్లో నిలబడ్డ దొరకని పరిస్థితి నెలకొంది. జనగాంజిల్లా పాలకుర్తిలో పరిస్థితి మరి దారుణంగా తయారైంది. యూరియా కోసం కో ఆపరేటివ్ బ్యాంక్ దగ్గర ఉదయం నుంచి బారులు తీరారు. అయినా ఒకబస్తా యూరియా కూడా దొరకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పనులు వదులుకుని యూరియా కోసం నిలబడితే.. దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. రైతులకు అవసరమైన యూరియాను అందించాలని డిమాండ్ చేస్తున్నారు.