కేసీఆర్ నాయకత్వంలో పని చేయడం ఆనందంగా ఉంది: మంత్రి ఎర్రబెల్లి
సీఎం కేసీఆర్ నాయకత్వంలో పని చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. ప్రభుత్వంలో కీలకమైన పంచాయతీరాజ్ శాఖ తనకు ఇవ్వడం గర్వకారణంగా ఉందన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో పని చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. ప్రభుత్వంలో కీలకమైన పంచాయతీరాజ్ శాఖ తనకు ఇవ్వడం గర్వకారణంగా ఉందన్నారు. పల్లె ప్రగతితో గ్రామాలు బాగుపడ్డాయన్న ఎర్రబెల్లి.. ప్రతి గ్రామంలో వైకుంఠధామం, వాటర్ ట్యంక్లు, పరిశుద్ధ్యం మెరుగు, చెట్ల పెంపకం చేస్తున్నామన్నారు.
నీళ్ల కోసం బాబ్లీ వ్యతిరేక పోరాటంలో పాల్గొని జైలుకెళ్లానని... కానీ నేడు కాళేశ్వరంతో నీళ్లు రావడం ఆనందంగా ఉందన్నారు. కేసీఆర్, కేటీఆర్ల సహకారంతో ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానన్నారు.