కామ్రేడ్స్‌ కారెక్కారు : హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్‌కే మద్దతు

Update: 2019-10-01 15:51 GMT

కామ్రేడ్స్‌ కారెక్కారు. టీఆర్ఎస్‌పై విరుచుకుపడే కమ్యూనిస్టులు.. గులాబీకి సలాం కొట్టారు. హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్‌కే మద్దతివ్వాలని.. సీపీఐ నిర్ణయించింది. ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల క్రితం టీఆర్ఎస్‌ నాయకులు సీపీఐ నాయకులతో భేటీ అయ్యారు. హుజూర్‌నగర్‌లో తమకే మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇటు తమకే మద్దతివ్వాలని కాంగ్రెస్‌ కూడా సీపీఐని కోరింది. దీనిపై పార్టీలో తీవ్రంగా చర్చించిన నాయకులు.. చివరకు అధికార పార్టీకే జై కొట్టారు. కాంగ్రెస్‌తో పొత్తు.. గత ఎన్నికల వరకే అని స్పష్టం చేసింది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ తమను పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్‌కు మద్దతిచ్చినంత మాత్రాన.. ప్రజా సమస్యలపై పోరాటం ఆపబోయేది లేదని ఆ పార్టీ నాయకులు స్పష్టం చేశారు.

Tags:    

Similar News