దేశంలో ఇప్పటికే జనతా కర్ఫ్యూను పొడగిస్తూ పలు రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణలో 24 గంటలున్న జనతా కర్ఫ్యూ ఈ నెల 31 వరకు పొడగించే అవకాశం ఉంది. కాసేపట్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్న సీఎం కేసీఆర్ సాయంత్రం 5 గంటల సమయంలో చప్పట్లు కొట్టాక ఈ ప్రకటన చేస్తారని తెలుస్తోంది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ముఖ్యమంత్రి ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కర్ఫ్యూను 31 వరకు పొడగిస్తారని చెబుతున్నారు. నిత్యావసరాలు, అత్యవసర సేవలు మినహా అన్ని సేవలూ నిలిపివేసే అవకాశం కనిపిస్తుంది.