తెలంగాణ సచివాలయంలో పనిచేసే సెక్షన్ ఆఫీసర్ కు కరోనా నెగిటివ్ రావడంతో సచివాలయ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన మత సమావేశాలకు సచివాలయ ఉద్యోగి కూడా హాజరైన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా సచివాలయంలో కలకలం రేగింది. అయితే సచివాలయ ఉద్యోగికి నెగెటివ్ రిపోర్ట్ వచ్చినప్పటికీ.. హోం క్వారంటైన్లో ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.