కుక్కకు ఉన్న విలువ మనుషులకు లేదా? కార్మికులు చనిపోతే మంత్రులపై కేసులేందుకు నమోదు చేయలేదు?
ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఈనెల 19 లోగా పరిష్కరించకుంటే 21న ప్రగతి భవన్ ముట్టడిస్తామన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి.
ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఈనెల 19 లోగా పరిష్కరించకుంటే 21న ప్రగతి భవన్ ముట్టడిస్తామన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. గత నెల ప్రగతి భవన్లో హస్కీ అనే కుక్క చనిపోయిందని, సంబంధిత డాక్టర్పై 5 సంవత్సరాల శిక్ష పడేలా కేసు నమోదు చేశారని, కుక్కకు ఉన్న విలువ మనుషులకు లేదా అని ప్రశ్నించారు. మంత్రుల బాధ్యతారాహిత్యం వల్లే కార్మికులు చనిపోయారని, మంత్రుల మీద కేసు ఎందుకు నమోదు చేయలేదని మండిపడ్డారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకోకుండా కాంగ్రెస్ పిలుపునిస్తోందని, కాంగ్రెస్ పార్టీ కార్మికులకు అండగా ఉంటుందన్నారు ఎంపీ రేవంత్ రెడ్డి.